నటుడు 'మోహన్ బాబు' ఇంట్లో విషాద ఛాయలు ..
మాజీ రాజ్యసభ సభ్యులు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. తిరుపతిలో ఉండే ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు(63) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి రంగ స్వామి నాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వైద్యం నిమిత్తం కుటుంబ సభ్యులు చాలానే డబ్బులు ఖర్చు పెట్టారు. అయినా రంగ స్వామి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తాజాగా ఆయన తుది శ్వాస విడిచారు.
ఇక రంగ స్వామి నాయుడు మృతి పట్ల పలుగురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మోహన్ బాబు కు ఫోన్ చేసి సంతాపాన్ని తెలియజేసారు. కాగా రంగ స్వామి నాయుడు అంత్య క్రియలు గురువారం తిరుపతిలో జరుగనున్నాయి.