బాసర, నరసరావుపేట జ్ఞాన సరస్వతి ఆలయాల్లో భక్తుల రద్దీ..

బాసర,  నరసరావుపేట జ్ఞాన సరస్వతి ఆలయాల్లో భక్తుల రద్దీ..

బాసర/నరసరావుపేట  : శనివారం వసంత పంచమి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామునుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు దీరారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో భారీగా అక్షరభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని పలు సరస్వతి ఆలయాల్లో కూడా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరు  జిల్లా నరసరావుపేట, పిడుగురాళ్ళ  లోని సరస్వతి ఆలయాల్లో కూడా భక్తులు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0