పిడుగురాళ్ళ లో ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన

పిడుగురాళ్ళ లో ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన

పిడుగురాళ్ళ : పట్టణంలోని శ్రీ దత్త సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ వారి మూడు రోజులు కార్యక్రమంలో భాగంగా మొదటిరోజైన శనివారం నాడు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేషస్పందన లభించింది. పట్టణం మరియు పరిసర గ్రామాల లోని అనేక మంది పెద్దఎత్తున ఈ శిబిరానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారికి రూ. 1320 లు విలువచేసే పలు రకాల రక్తపరీక్షలను ఉచితంగా నిర్వహించి, మందులను అందజేసారు.

మొదటిరోజున సుమారు 500 మంది వరకు శిబిరానికి హాజరైనట్లు హాస్పిటల్‌ నిర్వాహకులు తెలియజేసారు. హాస్పిటల్‌ సిఎండి మరియు సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ గార్లపాటి కృష్ణకాంత్‌ మరియు డైరెక్టర్ డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి ల ఆధ్వర్యంలో కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ జి. మహేష్‌రెడ్డి, న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ ఎంబి నవీన్‌ కుమార్‌ మరియు ఇతర నలుగురు డాక్టర్లు, సిబ్బంది పాల్గొని వైద్యసేవలు అందించారు. ఆదివారం నాడు కూడా 2వ రోజు వైద్య శిబిరం హాస్పిటల్‌లో జరుగుతుందని వారు తెలిపారు.

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
1