ట్రాక్టర్ నడిపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్..!
గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం ట్రాక్టర్ నడిపారు. ఈ ఆసక్తికర దృశ్యం గుంటూరు జిల్లా చుట్టగుంట ప్రాంతంలో కనిపించింది. రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్ జగన్ స్వయంగా ట్రాక్టర్ను నడిపారు. గుంటూరు జిల్లాలోని చుట్టగుంట వద్ద 'వైఎస్సార్ యంత్ర సేవ పథకం' రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ యంత్ర సేవ పథకాన్ని రైతుల కోసం ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్రాక్టర్ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.