జంటిల్మన్ 2లో హీరోయిన్గా నయనతార చక్రవర్తి..
ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ నిర్మాతగా శంకర్ ఎస్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన “జెంటిల్ మేన్ “తమిళ మూవీ 1993 సంవత్సరంలో జూలై 30 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో శంకర్ దర్శకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.“జెంటిల్ మేన్ “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.
కాగా, ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ నిర్మిస్తున్న భారీ చిత్రం జెంటిల్మన్ 2.. దీంతో తిరిగి నిర్మాణరంగంలోకి వచ్చారు. ఇది అర్జున్ సర్జా, మధుబాల నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జెంటిల్మన్’కి సీక్వెల్గా రూపొందబోతోంది. మలయాళంలో బాలనటిగా అనేక చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్న నయనతార చక్రవర్తి ‘జెంటిల్మన్ 2’తో హీరోయిన్గా పరిచయం అవుతోంది. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్లో కుమార్తెగా నటించింది. ఆ తర్వాత నయనతార చక్రవర్తి చేస్తున్న సినిమా ఇది.
ఈ సినిమాలో మరో కథానాయిక కూడా నటించ నున్నారు. ఎవరనేది త్వరలో వెల్లడికానుంది. కె.టి.కుంజుమన్ తన టిట్టర్లో ఈ విషయాన్ని తెలియ జేస్తూ, ప్రధాననటిగా నయనతార చక్రవర్తిని పరిచయం చేస్తున్నాం. మరో కథానా యికను త్వరలో వెల్లడిస్తాం అని పేర్కొ న్నారు. “ప్రేమికుడు”, “ప్రేమదేశం”, “ప్రేమికుల రోజు”వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన కుంజుమోన్ చాల గ్యాప్ తరువాత “జెంటిల్ మేన్ “మూవీ సీక్వెల్ “జెంటిల్ మేన్2 “మూవీని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఎం.ఎం. కీరవాణిని ఎంపిక చేసినట్టు నిర్మాత కుంజుమోన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.