వున్న చట్టాలు చాలు : చంద్రబాబు నాయుడు

వున్న చట్టాలు చాలు : చంద్రబాబు నాయుడు

అమరావతి, జూన్ 29 (ఇండియాజ్యోతి)  :  
తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.!   మంగళవారం సాధన దీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా సీఎం జగన్కు ఉంటే ఆ చట్టాలే సరిపోతాయని అన్నారు.  లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు.  సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోకుండా సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని ఎద్దేవా చేశారు. కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.  బాధ్యత గల ప్రతిపక్షంగా ముందు జాగ్రత్తలపై ప్రభుత్వాన్ని హెచ్చరిoచినా ఏమాత్రం పట్టించుకోకపోగా ఎగతాళి చేశారని మండిపడ్డారు.  5 కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించమంటే తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు.  టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల కూడా వితండవాదం చేశారని, 16.53 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారని, తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారని విమర్శించారు.  న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడంతో సీఎం జగన్ తోక జాడించారని చంద్రబాబు అన్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0