మర్రిచెట్టు కింద వెలిసిన నాగమయ్య స్వామి.. పెద్దఎత్తున తరలివెళుతున్న ప్రజలు..

మర్రిచెట్టు కింద వెలిసిన నాగమయ్య స్వామి.. పెద్దఎత్తున తరలివెళుతున్న ప్రజలు..

గుంటూరు : జిల్లా లోని దాచేపల్లి మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో  బ్రహ్మంగారి గుడి సన్నిధిలో ఉన్న మర్రిచెట్టు కింద నాగమయ్య స్వామి వెలిశారు. ఈ దృశ్యాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చివెళుతున్నారు.  చుట్టుప్రక్క గ్రామాల నుండి కూడా రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నారు. అంతేగాకుండా భక్తులు అక్కడ పూజలు చేస్తూ, ప్రదిక్షణాలు చేస్తున్నారు. అలాగే శివరాత్రి సందర్బంగా గ్రామ పెద్దల సహకారంతో మంగళవారం నాడు ప్రత్యేక కార్యక్రమాలు, జాగారం జరుగుతాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే మర్రిచెట్టు కింద నాగమయ్య వెలుస్తాడని బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానం లో రాసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.  

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0