మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందారు. కొంతకాలంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు హయాంలో అటవీశాఖ మంత్రిగా బొజ్జల పనిచేశారు. అలిపిరి బ్లాస్ట్ ఘటనలో బొజ్జల చంద్రబాబుతో పాటు గాయపడ్డారు.