బ్యాంకు ఉద్యోగులకు 'శ్రీ దత్త హాస్పిటల్' వారి ఉచిత మెగా హెల్త్ చెకప్ క్యాంప్..
నరసరావుపేట, మే 22 (ఇండియాజ్యోతి) : ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్ బిఐ) ఉద్యోగులకు పట్టణంలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఉచిత మెగా హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరం నందు రీజియన్ లోని సుమారు 40 బ్రాంచ్ ల ఉద్యోగులు హాజరై వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరం నందు ఉద్యోగులకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. పట్టణంలోని ఎస్బిఐ ఆర్బిఓ కాన్ఫెరెన్స్ హాల్ నందు జరిగిన ఈ శిబిరం నందు దాదాపు 300 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ పరీక్షల అనంతరం డాక్టర్లు ట్రీట్ మెంట్ రాసి, వివిధ రకాల జబ్బులపై అవగాహన కల్పించారు. శ్రీ దత్త గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ మరియు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ ఎల్ఈడీ స్క్రీన్ పై గుండె జబ్బులపై అవగాహన కల్పించారు. గుండె జబ్బుల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. శిబిరంలో ఇంకా డాక్టర్లు పి. మహేశ్వర రావు, ఎంబి నవీన్ కుమార్, మృదుల తేజస్విని, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు, హాస్పిటల్ సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఎల్ఈడీ స్క్రీన్ పై గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తున్న డాక్టర్ కృష్ణకాంత్