కరోనా పేషెంట్లకు తెలుగుదేశం అండ : డాక్టర్ చదలవాడ అరవిందబాబు

కరోనా పేషెంట్లకు తెలుగుదేశం అండ : డాక్టర్ చదలవాడ అరవిందబాబు
నరసరావుపేట, మే 08 (ఇండియాజ్యోతి) :  లింగంగుంట జిల్లా ఆసుపత్రిలో కరోనా తో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులను నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు శనివారం పరామర్శించారు. వారిలో మనోధైర్యాన్ని నింపి మీకు మేము అండగా ఉంటామని పేర్కొన్నారు. 
కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు కోరారు. కరోనా సెకండ్ వేవ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో నరసరావుపేట లింగంగుంట్ల కోవిడ్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను శనివారం హాస్పటల్లో పరిశీలించారు ఈ సందర్భంగా నరసరావుపేట లో కోవిడ్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్ లో వైద్య సేవలు అందించేందుకు అదనంగా వైద్యులతో పాటు నర్సులు, సిబ్బందిని నియమించాలని కోరారు. ఆక్సిజన్ సరఫరాను అన్ని కోవిడ్ హాస్పటల్స్ కు యుద్దప్రాతిపదికన అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ హాస్పటల్ లోని రోగులకు పూర్తి వైద్య పరీక్షలు,మందులు,స్కానింగ్ కూడా రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని అదే విధంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ లో అన్ని వసతులు ఏర్పాటు కు హాస్పిటల్లో అదనంగా సిబ్బంది పెంపుదల, వసతుల ఏర్పాట్లపై నిన్న కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది అని తెలియజేశారు.కరోనా విజృంభణ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వ్యాప్తి కాకుండా నియమ నిబంధనలు పాటించాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు డా౹౹చదలవాడ అరవింద బాబు సూచించారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0