సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారం”మందిరం
శ్రీకాకుళం : అసని తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. భారీ అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు మంగళవారం ఉదయం ఎప్పుడు చూడని వింతైన రధం ఒకటి కొట్టుకు వచ్చింది. అక్కడి ప్రజలు దీనిని వీక్షించేందుకు ఎగపడుతున్నారు. ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన ఈ రధం అసాని తుపాన్ ప్రభావంతో సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు చేరిన ఈ రధంపై తేది 16-1-2022 అని విదేశీ బాషలో లిక్కించి ఉందని, మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు అంటున్నారు. ఇంతవరకు తితిలి వంటి ఎన్నో పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన మందిర రధం చూడలేదని తెలియజేస్తున్నారు. మేరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిజేశారు. దీని ఖరీదు కోట్లలో ఉంటుందని అంచనా.