సిఎం జగన్ పై దాడి సమయంలో నిలిచిన విద్యుత్ సరఫరా..
*సీఎం జగన్ పై టీడీపీ చేయించిన రాళ్ల దాడి అత్యంత హేయనీయం. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేక టీడీపీ రాళ్ల దాడికి దిగింది. రాజకీయాల్లో సీఎం జగన్ ను ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం దారుణం. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి : కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్*
ఇదిలా ఉంటే సీఎం జగన్ పై దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు. ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. రాయి వచ్చిన వైపు స్కూల్ బిల్డింగు భవనాలు ఉన్నాయి.