“వీరసింహా రెడ్డి” లో వైరల్ గా మారిన ఈ డైలాగ్.!

“వీరసింహా రెడ్డి” లో వైరల్ గా మారిన ఈ డైలాగ్.!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘వీరసింహారెడ్డి’’ సినిమాలోని డైలాగ్స్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా డైలాగ్స్ వున్నాయి.  సంతకంతో బోర్డు పై పేరు మారుతుంది కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’  ఆ పేరు గల వ్యక్తి చరిత్ర ఎప్పటికీ మారదు అన్నట్టు “వీరసింహా రెడ్డి” లో చెప్పిన డైలాగ్ ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. చిత్ర యూనిట్ నిన్ననే ట్రైలర్ ని ఒంగోల్లో రిలీజ్ చేయగా అందులో బాలయ్య పలికించిన ఓ పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు అభిమానుల్లో చర్చగా మారింది.
దీనికి కారణం లేకపోలేదు.. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్ ప్రభుత్వం మార్చింది. దానికి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసింది. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వైద్య రంగానికి ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తింపుగా హెల్త్ యూనివర్సిటీకి ఈ పేరు పెట్టారని.. జగన్ తండ్రి వైఎస్ కూడా ఈ పేరును మార్చలేదని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గుర్తుచేసింది. ఇవేవి పట్టించుకోని జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనిపై కొద్దిరోజుల పాటు టీడీపీ ఆందోళన చేసింది . గత కొన్ని నెలల కితం జరిగిన పలు సంఘటనలపై మళ్ళీ బాలయ్య ఇలా అందుకున్నారని చెప్పాలి. అలాగే గతంలో అఖండ లో కూడా ఈ తరహా సెటైర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0