రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ, సీఎం జగన్ పదికాలాల పాటు సుపరిపాలన అందించాలని శ్రీవారిని కోరుకున్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మంత్రి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద స్వామీజీ, శ్రీశ్రీశ్రీ జగద్గరు శంకరాచార్యల శ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీలతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీ హంపి విరూపాక్ష మహా సంస్థానం శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్యల శ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీ వారిని కలిసి అశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు ఉన్నారు.