మద్యం మత్తులో భార్య గొంతుకోసి చంపిన భర్త..

మద్యం మత్తులో భార్య గొంతుకోసి చంపిన భర్త..

మద్యం మత్తులో కట్టుకున్న భార్య గొంతునే కోశాడు ఓ వ్యక్తి. సోమవారం రాత్రి నగర శివార్లలోని మహేశ్వరంలో ఈ ఘటన జరిగింది. తాము నివాసం  ఉంటున్న ఇంట్లో మద్యం మత్తులో ఉన్న భర్తే తన భార్యను  హత్య చేశాడు. ఇద్దరి మధ్య తలెత్తిన గొడవలే హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కందుకూరుకు చెందిన ఎ నరసింహ, మంగమ్మ (35) దంపతులు గత ఐదేళ్లుగా మాణిక్యమ్మ గూడలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు.
నరసింహకు మద్యం అలవాటు ఉందని, తరచూ మద్యం తాగి ఇంటికి వెళ్లి భార్యను కొట్టడమే కాకుండా గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి వాగ్వాదం జరగడంతో ఆమెను కరెంటు తీగతో గొంతుకోసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతదేహాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు మహేశ్వరం పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసింహను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
1
funny
0
angry
0
sad
0
wow
0