మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశం : డీజీపీ 

మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశం : డీజీపీ 

అమరావతి (ఇండియాజ్యోతి)  : ప్రస్తుతం మాచర్లలో శాంతిభద్రతలు  అదుపులోనే ఉన్నాయని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రస్తుతం మాచర్ల లో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. అదనపు బలగాలు కూడా మోహరించాయన్నారు. నిన్న మాచర్ల లో టీడీపీ, వైసీపీ పరస్పరం దాడులు చేసుకున్న ఘటనపై డిజిపి ఆరా తీశారు. ఈ అల్లర్ల ఘటనకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే   సహించేదిలేదన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు డీజీపీ వెల్లడించారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0