పల్నాడు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా 90 అడుగుల జాతీయ జెండా..  

నరసరావుపేట, జులై 29 (ఇండియాజ్యోతి) : స్వాతంత్రం వచ్చి 75 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో చిరస్థాయిగా గుర్తుండి పోయేలా 90 అడుగుల జాతీయ జెండా పతాక ఆవిష్కరణ కై జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి  స్థానిక నరసరావుపేట పురపాలక సంగం గాంధీ పార్కులో స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శేషి రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర, మండల రెవెన్యూ అధికారి రమణ నాయక్ వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0