డాక్టర్గా మారిన వైస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా..!
పుత్తూరు : సినీ నటి, ఎమ్మెల్యే రోజా డాక్టర్ గా మారి అందరిని ఆశ్యర్యపరిచారు. వివరాలిలావున్నాయి. పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో ఆదివారం సుభాషిణి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ‘నేను డాక్టరు కావాలనేది మా ఇంట్లో వాళ్ల కల. ఇంటర్లో బైపీసీ తీసుకుని మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష రాశా. ఈ లోగా సినిమా హీరోయిన్గా చాన్స్ రావడంతో అటు వైపు వెళ్లా. మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించా. ఇవాళ మెడికల్ క్యాంప్లో మెడలో స్టెతస్కోప్ పెట్టుకుని రోగి బీపీని చూస్తూ డాక్టరై నా కోరిక తీర్చుకున్నా’ అని తెలిపారు. వేళకు మంచి ఆహారం తీసుకుంటూ, ప్రతి రోజు వాకింగ్ చేయాలని సూచించారు. పలు హెల్త్ టిప్స్ ను ఆమె చూచించారు. ఆస్పత్రి వైద్యాధికారులు సుభాషిణి, శ్రీధర్రాజు బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో 350 మంది రోగులను పరీక్షించినట్లు ఆస్పత్రి సీఈవో శ్రీనివాస్ తెలిపారు. ఎంపీపీ మునివేలు తదితరులు పాల్గొన్నారు.