టిఫిన్ పెట్ట‌లేద‌ని.. కోడ‌లిపై మామ కాల్పులు

టిఫిన్ పెట్ట‌లేద‌ని.. కోడ‌లిపై మామ కాల్పులు

మహారాష్ట్రలో ఓ మామ టిఫిన్​ పెట్టలేదన్న కారణంతో కోడలిపై కాల్పులకు దిగిన ఘ‌ట‌న‌  చోటుచేసుకుంది. ఠాణెలో గురువారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని కాశీనాథ్​ పాండురంగ్​ పాటిల్​గా (76) పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడి మరో కోడలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీతో పాటు కోడలు తనకు బ్రేక్​ఫాస్ట్​ పెట్టలేదనే కోపంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. అంతేగాకుండా మామ కోడలిపై తరచూ గొడవ పడుతుండేవాడని చెబుతున్నారు. అయితే ఈ ఘటన వెనుక మరే కారణమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0