టిఫిన్ పెట్టలేదని.. కోడలిపై మామ కాల్పులు
మహారాష్ట్రలో ఓ మామ టిఫిన్ పెట్టలేదన్న కారణంతో కోడలిపై కాల్పులకు దిగిన ఘటన చోటుచేసుకుంది. ఠాణెలో గురువారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని కాశీనాథ్ పాండురంగ్ పాటిల్గా (76) పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడి మరో కోడలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీతో పాటు కోడలు తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టలేదనే కోపంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. అంతేగాకుండా మామ కోడలిపై తరచూ గొడవ పడుతుండేవాడని చెబుతున్నారు. అయితే ఈ ఘటన వెనుక మరే కారణమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.