టీటీడీ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం

టీటీడీ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం

తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి లో మరో సభ్యుడు  ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు నూతన సభ్యుడిగా కృష్ణమూర్తి వైద్యనాథన్‌  శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత కృష్ణమూర్తి వైద్యనాథన్‌ శ్రీవారిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఆయనకు ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్‌ బుక్‌ను అందజేశారు. కాగా నూతన సభ్యుని వెంట ఆయన కుటుంబ సభ్యులు వున్నారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0