చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్ దంపతులు..
హైదరాబాద్ : సీఎం కెసిఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. ముచ్చింతల్ ఆశ్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాలువాలతో చినజీయర్ స్వామి సత్కరించి, వారిని ఆశీర్వదించారు. భగవత్ రామానుజాచార్యుల ప్రాజెక్ట్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.