గుడ్ న్యూస్ : మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు..
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై కొంతకాలం ఆంక్షలు విధించడం లాంటి కారణాలతో భారతదేశంలో ఇటీవల వంటనూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వినియోగదారుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడంతో వంటనూనెల ధరలు దిగొచ్చాయి. వంట నూనెల ధరల్ని తగ్గించాలంటూ ఎడిబుల్ ఆయిల్స్ కూడా కంపెనీలతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పలుమార్లు చర్చలు జరిపింది.ఈమేరకు వెంటనే వంటనూనెల ధరల్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో గ్లోబల్ మార్కెట్లో పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ధర తగ్గడంతో భారతదేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారం ఆయిల్ కంపెనీలతో జరగబోయే సమావేశంలో వంటనూనెల ధరల్ని మరింతగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది.