గుజరాత్లో బీజేపీ క్లీన్ స్వీప్.. 44 స్థానాల్లో 41 కైవసం
గుజరాత్ గాంధీనగర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీపన చేసింది. ఇక్కడ ఆదివారం ఎన్నికలు జరగ్గా, మంగళవారం ఉదయం లెక్కింపు ప్రారంభమైంది. సాయంత్రం నాటికి తుది ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 44 స్థానాలుండగా, 41 స్థానాలను బీజేపీ గెలుచుకొని ఘన విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ రెండు స్థానాలు, అప్ ఒక స్థానం గెలుచుకున్నాయి. దీంతో అక్కడ బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.