కేంద్ర హోంమంత్రి 'అమిత్ షా' కు తప్పిన ప్రమాదం.. 

కేంద్ర హోంమంత్రి 'అమిత్ షా' కు తప్పిన ప్రమాదం.. 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం గత రాత్రి గువాహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం అగర్తల లో ల్యాన్డ్ కాలేక పోయింది. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానంను గువాహటిలో ల్యాండ్ చేయించారు.. రాత్రికి గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అమిత్ షా బస చేశారు. మంత్రి అగర్తల వెళ్తుండగా ఆ ఘటన జరిగింది. ఈ ఉదయం ఆయన అగర్తల చేరుకుంటారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి అక్కడ రథయాత్రను ప్రారంభించనున్నారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0