11,12 తేదీల్లో తిరుమలలో సీఎం జగన్ పర్యటన
తిరుమల : సీఎం జగన్ ఈ నెల 11,12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. సీఎం తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల విభాగాన్ని సీఎం ప్రారంభించ నున్నారు. అలిపిరి వద్ద గో మండపాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు- వస్త్రాలు సమర్పించనున్నారు.
12న ఉదయం శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. అనంతరం ఎస్వీబీసీ కన్నడ,హిందీ ఛానళ్లను ప్రారంభించనున్నారు. కొత్త బూందీపోటు భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అన్నమయ్య, భవన్లో టీటీడీ, ఏపీ రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ, టీటీడీ కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించనున్నారు.
దేవస్థాన సేవలన్నీ ఒకే యాప్ లో:వైవీ సుబ్బారెడ్డి
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థాన సేవలన్నీ ఒకే యాప్ లో భక్తులకు అందుబాటులో ఉండనున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దీన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ద్వారా భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి సకల బుకింగ్ల సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.