రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : రైలు కిందపడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పీఎస్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాటేదాన్ సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రావణ్కుమార్గౌడ్ కుమారుడు రాగిణి రిషిగౌడ్(21) డిగ్రీ చదువుతున్నాడు. శుక్రవారం శివరాంపల్లి- బుద్వేల్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
What's Your Reaction?






