ప్రధాని మోదీ తో చంధ్రబాబు గంటకు పైగా భేటీ..

 ప్రధాని మోదీ తో చంధ్రబాబు గంటకు పైగా భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధానిని చంద్రబాబు అభ్యర్థించారు.  ప్రధానితో భేటీ సందర్భంగా గత ఆరు నెలల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పురోగతి పనులను వివరించారని తెలుస్తోంది. చంద్రబాబు ఈ రోజు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కానున్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0