దారుణం.. 17 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ అఘాయిత్యం..

దారుణం.. 17 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ అఘాయిత్యం..

యూపీ : యూపీలో దారుణమ్ జరిగింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్.. కామావతారం ఎత్తాడు.  వాళ్లకు సెక్స్ పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన కామవాంఛ తీర్చుకుని, ఎవరికైనా చెప్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నాడు. 
పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి.  ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 17 మంది విద్యార్థినులపై స్కూల్ ప్రిన్సిపల్ యోగేష్ కుమార్ తో పాటు, అతని సహచరుడు సైతం వేధింపులకు పాల్పడినట్లు స్థానిక పీఎస్ లో కేసు నమోదైంది. విద్యార్థినుల పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంపార్టెంట్ పాఠాలు చెప్పాలి, ప్రాక్టికల్స్ ఉన్నాయి.. స్కూల్ కి రమ్మని పిలిచి, ఆ రాత్రికి అక్కడే ఉండాలని సూచించేవాడన్నారు. . ప్రిన్సిపల్ మాట కాదనలేక అక్కడే ఉండిపోయిన బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టి.. స్పృహ కోల్పోయాక.. బాలికలపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆపై ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేయడంతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
1
wow
0