కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే..!

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ప్రాధాన్యతనిచ్చారు.
ఏపీకి కేటాయింపులు ఇవే:
- పోలవరం ప్రాజెక్టుకు - రూ. 5,936 కోట్లు
- పోలవరం ప్రాజెక్ట్ కు బ్యాలెన్స్ గ్రాంట్ - రూ. 12,157 కోట్లు
- విశాఖ స్టీల్ ప్లాంట్ కు - రూ. 3,295 కోట్లు
- విశాఖ పోర్ట్ కు - రూ.730 కోట్లు
- రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 240 కోట్లు
- జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు - రూ. 186 కోట్లు
- లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఆపరేషన్ కు - రూ. 375 కోట్లు
- ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి - రూ. 162 కోట్లు
- ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు - రూ.242.50 కోట్లు.
What's Your Reaction?






