ఏపీ లో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌..

ఏపీ లో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌..

ఏపీ లో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్టంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2,134 కోట్లతో ఐదు పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా.. 7,683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు..
►వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌, రిటైల్‌ లిమిటెడ్‌ ఏర్పాటు
►ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనున్న ఆదిత్యా బిర్లా
►రూ.110 కోట్ల పెట్టుబడి, 2112 మందికి ఉద్యోగాలు►వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో ప్లైవుడ్‌ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న సెంచురీ
►రూ.956 కోట్ల పెట్టుబడి, 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
►ఈ పరిశ్రమ ఏర్పాటు కారణంగా రైతులకు భారీగా మేలు జరుగుతుందన్న అధికారులు
►దాదాపు 22,500 ఎకరాల్లో యూకలిఫ్టస్‌ చెట్లను కొనుగోలు చేస్తారన్న అధికారులు
►దాదాపు రూ.315  కోట్ల ఉత్పత్తులను రైతులనుంచి కొనుగోలు చేస్తారన్న అధికారులు
►తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌
►చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రాసిం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ
►ఈ కంపెనీ ద్వారా రూ.861 కోట్ల పెట్టుబడి, 405 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
►స్థానిక ప్రజల ఆందోళన నేపథ్యంలో థర్మల్‌పవర్‌ ప్లాంట్‌ను పెట్టబోమని స్పష్టంచేసిన గ్రాసిమ్‌ కంపెనీ
►స్థానిక ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని విరమించుకున్నామంటూ స్పష్టంచేసిన కంపెనీ.. కంపెనీ స్పష్టత నేపథ్యంలో ఎస్‌ఐపీబీ ఆమోదం

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0